ఇండియా : విశ్వక్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకెళ్తోంది. సమష్టి కృషితో పతకంపై ఆశలు రెకెత్తిస్తోంది. తాజాగా 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. కీలక క్వార్టర్ ఫైనల్లో 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్పై నెగ్గి సెమీస్కు చేరింది. కాగా, అసాధారణ రీతిలో ఒలింపిక్స్ హాకీలో 8 స్వర్ణాలు గెలిచిన భారత్.. చివరిసారి 1980లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో పతకం గెలవలేదు. అయితే గత అయిదేళ్లలో మెరుగుపడ్డ భారత్.. టోక్యోలో పతకంపై ఆశతో ఉంది. తాజాగా 41 ఏళ్ల తర్వాత భారత్ సెమీ ఫైనల్కు చేరింది. ఈ మేరకు సెమీస్లో బెల్జియంతో తలపడనున్న భారత్ గెలువాలని కోరుకుందాం.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more