హైదరాబాదులోని యూసఫ్గూడాలో నూతనంగా ఆవిష్కరించబడిన ‘అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. హంగులతో కూడిన ఈ సంస్థ ఆకర్షణీయమైన వాతావరణంలో నగరవాసులకు నూతన అనుభవాన్ని అందించనుంది దీనిని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలిలో విపక్ష నాయకుడు మాజీ స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూదనా చారి , ఎమ్మెల్సీ శ్రీ దయాకర్, ఎమ్మెల్సీ శ్రీ దాసోజు శ్రావణ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ,ప్రముఖ చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్ సుధావాణి,
రాజీవ్, కపిల్. మరియు ఇతర ప్రముఖులు పాల్గొని, కార్యక్రమానికి వన్నె తెచ్చారు.
‘అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సందర్శకులకు అరేబియన్ సంస్కృతి, రుచికరమైన వంటకాలు మరియు సౌకర్యవంతమైన వాతావరణంతో అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంస్థ నగరంలోని ఆహార ప్రియులకు, సాంస్కృతిక ఔత్సాహికులకు ఒక కొత్త గమ్యస్థానంగా నిలుస్తుందని ఆశిస్తున్నాము