ఏపీలోని బీసీలను తాను ఏకం చేస్తానని, దానికి అవసరమైన ఆయుధాలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పంపిణీ కోసం ఏపీ నుంచి గొర్రెలను కొనుగోలు చేయడం వల్ల అక్కడి యాదవులకు లాభం చేకూరిందని, చేపల పెంపకానికి అక్కడి నుంచే సీడ్ను దిగుమతి చేసుకున్నామని, ఇలాంటి విషయాలను బీసీల ఐక్యతకు ప్రయోగిస్తానని చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేసీఆర్ కలవడం వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఏపీలో తన ప్రచారం రెండు, మూడు శాతమైనా ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్భవన్లోనే?
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్భవన్లోనే? ఆమోదంపై సంసిద్ధంగా లేరా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాజ్భవన్ ఆమోదం పొందకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా...
Read more