- పట్టణ ప్రగతి‘ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్లో మొక్కలు నాటిన కార్పొరేటర్ : బన్నాల గీత
చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, చిల్కనగర్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మరియు చీఫ్ ఎంటరాలజిస్ట్ రాంబాబు మరియు రజని ఎల్బీనగర్ జూన్ ఎంటరాలజిస్ట్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారితో తో కలిసి మొక్కలు నాటారు
ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ మాట్లాడుతూ. చిల్కానగర్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు.
సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిల్కానగర్ ప్రాంతంలోని వివిధ కాలనీలలో బస్తీలలో పర్యటించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, ఓపెన్ నాలా సమస్యలు, వాటర్ బోర్ సమస్యలు, ఎలక్ట్రిసిటీ పోల్ షిఫ్టింగ్, మరియు డ్యామేజ్ పోల్స్ రీప్లేస్మెంట్ వంటి సమస్యలను అధికారుల మరియు కార్పొరేటర్ గారి దృష్టికి తేవడం జరిగింది.
పైన తెలిపిన వివిధ సమస్యలకు అధికారులు మరియు కార్పొరేటర్ వెంటనే చేయించి,మరి కొన్ని సమస్యలకు వెంటనే చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చిల్కానగర్ డివిజన్ కి ఆనుకొని ఉన్న చెరువులో గుర్రపుడెక్క తొలగింపు మరియు వేస్ట్ మెటీరియల్ ని తొలగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి నోడల్ ఆఫీసర్ రాజ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ డిఈ నిఖిల్ రెడ్డి, DE చందన,వాటర్ వర్క్స్ జంగయ్య, హార్టికల్చర్ సూపర్వైజర్ నర్సింగ్ రావు, ఎంటమాలజీ AE నరేష్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ రాజు , మున్సిపల్ ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు ఏదుల కొండల్ రెడ్డి వీబీ నరసింహ, రామ్ రెడ్డి,రవీందర్ రెడ్డి, కొంపల్లి రవీందర్ పరమేష్, కొకొండ జగన్, బింగి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, సుందర్, ప్రవీణ్, శ్రీకాంత్ బాలు,కైలాసం, సరిత అందాలు, అనసూయ తదితరులు పాల్గొన్నారు.