బి.జె.పి ఎం.ఎల్.ఏ ల సస్పెన్షన్ పద్ధతి రాజ్యాంగానికి, శాసనసభ నియమావళికి విరుద్ధంగా ఉందని భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు పేర్కొంది.
బి.జె.పి ఎం.ఎల్.ఏ ఈటల రాజేందర్, రఘునందన్రావు, రాజాసింగ్ సస్పెన్షన్ పై స్టే కోరుతూ పిటిషన్ ధాఖలు చేశారు. సస్పెన్షన్ ప్రొసీడింగ్స్, వీడియో రికార్డింగ్లను తమకు ఇవ్వాలని బి.జె.పి ఎం.ఎల్.ఏ లు కోరారు. కానీ ఈ అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వలేకపోయామని పోయామని బి.జె.పి ఎమ్మెల్యేలు హైకోర్టు రిజిస్ట్రీకి విన్నవించారు. కానీ అసెంబ్లీ విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న విషయాన్ని అడ్వొకెట్ జనరల్ బీ.ఎస్ ప్రసాద్ కోర్టును కి తెలిపారు. న్యాయస్థానం పూర్తి విచారణ కొరకు కౌంటర్లు సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. కేసు విచారణను మరో నాలుగు వారాలు వాయిదా వేసింది.