ఈ రోజు సాయంత్రం తర్వాత నుండి హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్కు ఉత్తరం, పడమర దిక్కున మేఘాలు ఎక్కువగా కమ్ముకున్నాయనీ చేవెళ్ల సమీపంలో దట్టంగా ఉన్న ఈ మేఘాలు హైదరాబాద్ వైపు దూసుకొస్తున్నాయనీ, దీని వలన భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ హెచ్చరిక వలన జీహెచ్ఎంసీ మరియూ డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలర్ట్ చేశారు.
అయితే ఈ విషయం ఒక రకంగా తీవ్ర ఎండలతో ఇబ్బందిపడుతున్న జంటనగరాలకు ఊరటనిచ్చే అంశం. ఇక్కడే కాకుండా వచ్చే మూడు రోజుల్లో తెలంగాణా అంతటా అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు.