నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం:
హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
ఈ నెల 7వ తేదీ (బుధవారం) హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న కాజా మాన్షన్ ఫంక్షన్ హాల్లో డెక్కన్ బ్లాస్టర్ మన్నన్ ఖాన్ మరియు బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిలుగా విచ్చేసిన దుండ్ర కుమారస్వామి, డాక్టర్ వినయ్ సరికొండ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, ప్రముఖ సామాజికవేత్త, దుండ్ర కుమారస్వామి,డాక్టర్ వినయ్ సరికొండతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను అందిస్తాయి. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ, విద్య, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో విభిన్న హోదాలలో ఉద్యోగాలు లభ్యమవుతాయి. విశేషంగా, కొన్ని కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ,
“అర్హత కలిగిన యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను ప్రదర్శించాలి. నీ కలల ఉద్యోగం నీ కోసం ఎదురుచూస్తోంది!” అని పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళా యువతకు ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే స్ఫూర్తిదాయక వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డాక్టర్ వినయ్ సరికొండ ; మాట్లాడుతూ
జాబ్ మేళా సందర్భంగా బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ మరియు సిగ్మా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లో ప్రముఖ వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సలహాలు అందిస్తారు. ఈ చర్య ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారణకు దోహదపడుతుంది. ఉద్యోగ అవకాశాలతో పాటు ఆరోగ్య సేవలను సమన్వయపరచడం ద్వారా ఈ కార్యక్రమం సామాజిక సంక్షేమ లక్ష్యాలకు నిదర్శనంగా నిలిచింది అని తెలిపారు.
వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు, వందలాది మల్టీనేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం ఉద్యోగ అవకాశాలతో పాటు ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకువస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
