తొలి పలుకు: మియాపూర్ : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్,మక్త మహబూబ్ పెట్ సర్వే నెంబర్ 39 లో మిదికుంట చెరువు కట్ట పై గత 200 సంవత్సరాలు కట్ట మైసమ్మ,, రేణుక దేవి,ఎల్లమ్మ, దుర్గమ్మ దేవాలయాలు ఉన్నాయని, వాటికి వెల్లె దారి సర్వే నెంబర్ 44/5 లో ఉన్న 5 ఎకరాల భూమిని పైన సత్యం గౌడ్ అశోక్, మానికి రావులు కబ్జా చేసి పెద్ద పెద్ద బండ రాళ్లు అద్దం వేసి భక్తులను గుళ్లకు రాకుండా అంతరాయం కలిగిస్తున్నారని టెంపుల్ కమిటీ చైర్మన్, ఫౌండర్, కృష్ణ పటేల్ గౌడ్, సెక్రెటరీ టి. సంతోష్ రెడ్డి లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, ఎమ్మార్వో, చందానగర్ సర్కిల్ అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 వందల సంవత్సరాల కు పైగా ఉన్న గుడిని 20 సంవత్సరాల క్రితం తన సొంత ఖర్చులతో అదుకరించి పునర్నిర్మాణం చేసినట్లు ఫౌండర్, చైర్మన్ కృష్ణ పటేల్ గోఫ్ తెలిపారు. పతి రోజు నిత్యా పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం భక్తులు ఎంతో ఘనంగా భోనాలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుoటారని పేర్కొన్నారు. పైన పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు గుడి రోడ్డును కబ్జా చేసి, నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల భక్తులు గుడికి రాలేకపోతున్నారని తెలిపారు. తక్షణమే అన్ని శాఖల అధికారులు స్పందించి కబ్జా ను తొలిగించి, గుడికి రోడ్డు ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని టెంపుల్ కమిటీ సభ్యులు హెచ్చరించారు.
మేము ఎవరి భూమిని కబ్జా చేయలేదు… సత్యం గౌడ్
మిదికుంట చెరువు కట్ట భూమిని కబ్జా చేశారని మాకు పిర్యాదు వచ్చిందని సత్యం గౌడ్ ను ప్రశ్నించగా మేము ఎవరి భూమిని కబ్జా చేయలేదని తెలిపాడు. ఎవరికైనా పిర్యాదు చేసుకొని అని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హద్దులు వేశారని, చెరువు ఎంతవరకు ఉందొ వాళ్లే అధికారులు నిర్ణయించారని పేర్కొన్నారు.