(తొలి పలుకు న్యూస్ ప్రతినిధి): కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సెంట్రల్ అల్లాపూర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్ పనులను పర్యవేక్షించిన సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో డివిజన్లోని అన్ని బస్తిలలో భూగర్భ డ్రైనేజీ మరియు సిసి రోడ్లు దశల వారీగా పూర్తి చేసుకుంటున్నాం అని అలాగే సంబంధిత కాంట్రాక్టర్కు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ బలరాం, పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?
కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు? జన్మాష్టమి పండుగ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ధర్మం, కర్తవ్యం, సత్యం, సమాజ బాధ్యతలే శ్రీకృష్ణుడి జీవన సారం...
Read more


