శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో శ్రీకృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో మహదేవ్ మరియు మిత్రులతో నిర్వహించిన బ్యాట్మెంటన్ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లోనూ రాణించడం ఎంతో సంతోషకరమైన విషమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. క్రీడా స్ఫూర్తితో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత గౌడ్, రాష్ట్ర బీజేవైఎం నాయకులు హరికృష్ణ, బిజెపి సీనియర్ నాయకులు భాను యాదవ్, క్రీడాకారులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు,.
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...
Read more