కరోనా రక్కసి మహిళా జర్నలిస్టు ప్రాణం తీసింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి కేంద్రంగా గత 8ఏండ్లుగా “బతుకమ్మ” కేబుల్ టీవి ప్రసారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆ ఛానెల్ నిర్వాహకురాలు కల్పన(40) బుధవారం సాయంత్రం చనిపోయారు. 5 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటీవ్ రాగా, ఇంట్లోనే ఉంటు మందులు వాడుతూ ఉన్నారు అయితే నిన్న ఆమె ఆక్సిజన్ లేవల్స్ 85కు పడిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రమంతాపూర్ లో ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆమె ఆకస్మిక మృతి పట్ల “తొలిపలుకు” చీఫ్ ఎడిటర్ దుండ్ర కుమారస్వామి సంతాపం తెలియజేశారు. కల్పన గారు నేటి మహిళలందరికీ గొప్ప ఆదర్శం, ఒక మహిళా జర్నలిస్టుగా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లేది. అలాంటి మంచి మనిషి ఈరోజు కరోనా మహమ్మారి కాటుకు బలైపోవడం సాటి జర్నలిస్టుగా నేను జీర్ణించుకోలేక పోతున్నాను అని వాపోయారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్నీ కుమారస్వామి కోరారు..
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more