యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీబీనగర్ లో వున్న సెంటర్ దూరంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయని, భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త గా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ లు వాడాలని కోరారు. ఈ రోజు 74 మందికి టెస్ట్ చెయ్యడం జరిగింది. ప్రతి రోజు దాదాపు గా 75 మందికి టెస్ట్ లు చేస్తారని జిల్లా వైద్యాధికారి సాంబశివ రావ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల వైద్య అధికారి కే. లీలా వతి, డాక్టర్ మురళి, వైస్ చైర్మన్ చింతల క్రిష్టయ్య, వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ తదితరులు పాల్గున్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more