దీపావళి పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మియాపూర్ డివిజన్ పరిధిలోని చిన్నారులకు ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి బీజేపీ నేత గుండె గణేష్ ముదిరాజ్ ఆదివారం రోజు క్రాకర్స్ పంచిపెట్టారు. మన తెలుగు పండుగలలో ముఖ్యంగా చిన్నారులతో పాటు పెద్దవారు కూడా ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగా సందర్భంగా ఆర్ కె వై టీమ్ తరుపున కొంత వరకైనా సాయం చేయాలనే దృక్పథంతో ఈ క్రాకర్స్ ను పంపిణీ చేశామని గణేష్ ముదిరాజ్ తెలిపారు. అందరిజీవితాల్లో వెలుగులు నింపాలని,సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్,జాజెరావు శ్రీను,రాము, చంద్రారెడ్డి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more