- తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరషన్ అధ్యక్షుడు నిర్వాకం.
- మహమూద్ అలీ ఒత్తిడి కారణమా?.
ఫిర్జాదిగూడ :తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా లోని ఫిర్జాదిగూడ ప్రాంతంలో తెరాస నాయకుడి వేధింపులు అపార్ట్మెంట్ వాసుల ఆందోళనలు..
వివారాలోకి వెళ్తే పీరజాదిగూడ లోని mro ఆఫీస్ ఎదురుగా లేకవ్యూ అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులుకు లోనావుతున్నారు. టీపీటీఫ్ (తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ) అధ్యక్షుడిగా చెప్పుకునే స్టానికి తెరాస నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ అపార్ట్మెంట్ వాసి మిగతా సహచర అపార్ట్మెంట్ వాసులని భయబ్రాంతులకి గురిచేస్తున్నాడు అని చెప్పారు అపార్ట్మెంట్ వాసులు. అసభ్యకరంగా మాట్లాడటం ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయడం, అపార్ట్మెంట్ కి సంబందించిన నెలవారీ రుసుము చెల్లించకుండా దౌర్జన్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని వాపోయారు. హోమశాఖమాత్యులు మహమూద్ అలీ ద్వారా పోలీసుల ద్వారా ఒత్తిడి చేసి మాకు ఇబ్బంది కల్గిస్తున్నారని చెప్పారు. ఇంత చిన్న విషయానికి మహమూద్ అలీ జోక్యం అవసరమా అని ఆందోళన వ్యక్తం చేసారు.
మహ్మద్ షబ్బీర్ అలీ అనే వ్యక్తి పై ఇంతకముందే చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్టుగా సమాచారం. అసలు ఈ వ్యక్తికి సంబంధించిన ఫెడరేషన్ అనేది కూడ లేదని అది లేకుండానే ప్రైవేట్ స్కూల్స్ నుండి వసూళ్ళకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ అధ్యక్షులు షబ్బీర్ అలీ ని వివరణ కోరగా మహ్మద్ షబ్బీర్ అలీ అనే వ్యక్తి మా సంఘం పేరును మరియు నా పేరును ఉపయోగిస్తూ నకిళి వ్యక్తిగా చేలామని అవుతున్నాడని అన్నారు. ఈ నకిళి వ్యక్తిపై చైతన్యపురి పోలిస్ స్టేషన్ లో కేసు కూడ నమోదు చేశామని తెలిపారు. అసలు ఆ వ్యక్తి పేరు md షబ్బీర్ అలీ అని నా పేరు shaik షబ్బీర్ అలీ అని నా పేరు చెప్పుకొని ఇలా దుర్వినియోగం చేస్తున్నాడని కేసు కూడ పెట్టానని చెప్పారు. ఇద్దరు పేర్లు ఒకేలా ఉన్నాయని ప్రజలు గాని స్కూల్ యాజమాన్యాలు దీని గుర్తించాలి అని చెప్పారు. ఇందులో కోసమేరుపు ఏంటంటే అసలు అ నకిలీ ఫెడరేషన్ కూడ రిజిస్టర్ అవలేదు అని తెలిసింది.తక్షణమే ఇట్టి వ్యక్తి పైన చెరియలు తీసుకోవాలని మీడియా ను ఆశ్రయించారు