తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు శేర్లింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ఆదేశాల మేరకు వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవీరంగరావు, రామకృష్ణ విధి అసోషియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురెందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ సభ్యులు భారీగా తరలివెళ్లి భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాలపై దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కార్యక్రమంలో శ్రీధర్, జలందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సూర్యనారాయణ, నారాయణ్ రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి, నాగేంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


