ఢిల్లీ : వంట నూనె ధరలతో బేజారెత్తిపోతున్న దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వంట నూనె ధరలు దిగి వస్తున్నాయి అని ప్రకటించింది. గత సంవత్సర కాలంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతూన్నాయి. అయితే ఇప్పుడు వంట నూనె ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు దిగిరావడం, దేశీ మార్కెట్లో డిమాండ్ తగ్గడం వంటి అంశాలు నూనె ధరల తగ్గుదలకు దోహదపడుతున్నాయని చెప్పుకొచ్చింది.
డిసెంబర్ నాటికి వంట నూనె ధర సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్సు పాండే ఈ విషయాలను వెల్లడించారు. వంట నూనె ధరల తగ్గడం మొదలైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ వస్తోందని, అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా డౌన్ ట్రెండ్ నడుస్తోందన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా వంట నూనె డిమాండ్ కూడా 15 – 20 శాతం మేర తగ్గిందని అన్నారు.
వంట నూనె ధర గత ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. అయితే దానిని ఒక అంతర్గత మంత్రిత్వ శాఖ అత్యవసర వస్తువుల ధరలను ప్రతి వారం సమీక్షిస్తూ వస్తోందని పేర్కొన్నారు. డిసెంబర్ వరకు సాధారణ స్థితికి వస్తుంది అని ప్రకటించారు..