శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో జై మాతాది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 2వ రోజు బాలత్రిపురసుందరి రూపంలో ఉన్నా అమ్మవారిని దర్శించుకున్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా దేవి ఆశీస్సులతో ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాతలు లక్ష్మి రాజేందర్ రెడ్డీ మరియు నాగలక్ష్మి భాస్కర్ రెడ్డీని శాలువాతో సత్కారించి అన్నప్రసాదాలు స్వీకరించరు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బల్లు యాదవ్, రమేష్ రెడ్డీ, వెంకటేష్, సాగర్ నాయక్, శ్రీకాంత్ మరియు కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more