బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు
ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన వధూవరులను మాజీ మంత్రి బోడా జనార్ధన్ మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, సుఖసంతోషాలతో కూడిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని కొత్త జంటకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్బంగా అతిథులు వధూవరులతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ, వారి భవిష్యత్తు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.