గుడిమల్కాపూర్ (తొలిపలుకు న్యూస్) : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుడిమల్కాపూర్, నవోదయ కాలనీ జైశ్రీరామ్ యువత ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణనాధుని ప్రత్యేక పూజల అనంతరం,
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_472/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0090-840x472.jpg)
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_472/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0092-840x472.jpg)
కుమారస్వామి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిసి దళ్ అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రజలు అన్ని విఘ్నాలు తొలగి సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. కోవిడ్ ప్రోటోకాల్, సామాజిక దూరం పాటిస్తూ, ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించి, కరోనా బారిన పడకుండా క్షేమంగా, సంతోషంగా వినాయక చవితి విడుకలు జరుపుకోవాలని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_630/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0088-840x630.jpg)
ఈ కార్యక్రమంలో సందీప్, కేశవ్, అనిల్, సాయినాథ్, సంతోష్, ఉదయ్ మల్లికార్జున్, అఖిల్ సాగర్ మరియు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.