శిల్పారామం మాదాపూర్ లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు ఎంతో సందడి సందడి సాగుతున్నాయి. చేనేత చీరలకి మంచి స్పందన వస్తుంది. బతుకమ్మ ఆటను శిల్పారామం మహిళా సిబ్బంది వచ్చిన సందర్శకులు కూడా ఆడుతున్నారు. ఈరోజు నుండి దాండియా ఆటను ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాతి స్టాల్ల్స్ వారు మరియు వచ్చిన సందర్శకులు కూడా పాల్గొన్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కందుల కూచిపూడి నాట్యాలయం గురువు జి. రవి శిష్య బృందం చే “దేవి వైభవం”కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. పార్వతి, లక్ష్మి సరస్వతి అమ్మవారులు కలిసి ఆదిశక్తి అమ్మవారి జననం నుండి మహిషాసుర మర్దిని సంహరించే కథను నృత్య రూపకంగా ప్రదర్శించారు. దాదాపుగా 100మంది కళాకారులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more