మాదాపూర్ శిల్పారామం లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో , బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు ఎంతో సందడిగా సాగుతున్నాయి. బతుకమ్మ మరియు దాండియా ఆటలో వచ్చిన సందర్శకులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పేరిణి నాట్యం మరియు ఆంధ్ర నాట్యం నృత్య రీతులలో శ్రీమతి సన్ధాయ పవన్ మరియు శ్రీ పేరిణి పవన్ శిష్య బృందం ప్రదర్శించి మెప్పించారు. ఆంధ్ర నాట్యం నృత్య రీతిలో కుంభ హారతి, వన్డే మాతరం, మామవతు శ్రీ సరస్వతి, నవజనార్ధన పారిజాతం పేరిణి నాట్యం లో ప్రవేశం, పుష్పాంజలి, దేవి కైవారం, భవాని కౌతం, శబ్ద పల్లవి అంశాలను శ్రీజ , ఐశ్వర్య, దీక్ష, శ్రీనార్థన, ప్రమీలక్షిత, మనస్విని మొదలైన వారు ప్రదర్శించారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



