చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, చిల్కనగర్ లోని వి కే స్టీల్స్ నుండి స్మశాన వాటిక వరకు నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గారు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి , ఈఈ నాగేందర్ , ఏఈ రాజ్ కుమార్ లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


