హైదరాబాద్ : బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కూలీల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటిచెప్పారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_490/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1625568432431-840x490.jpg)
ఫ్లై ఓవర్ రిబ్బన్ కటింగ్ను ఓ కూలీతో చేయించారు.
ఆ కూలీ ఎవరో కాదు.. వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. ఆమె గత రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్ను ప్రారంభించుకోవడంతో అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.