ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, అంబర్ పేట్, గోల్నాక డివిజన్ హిందూ స్మశాన వాటిక అన్ని వసతులు తో కొత్తగా నిర్మించాలని మరియు మైనారిటీల కోసం స్మశాన వాటిక కొత్తది ఏర్పాటు చేయాలని గోల్నాక డివిజన్ కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కెటి రామారావుని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి సంబంధించి కేటీఆర్ కు లావణ్య శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ నేపథ్యంలో తొందర్లోనే అంబర్పేట్ నియోజకవర్గానికి అభివృద్ధిపై ఒక మీటింగ్ పెట్టుకుందామని కేటీఆర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ కి హామీ ఇచ్చారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more