నల్లగొండ జిల్లా లోని మునుగోడు నియోజవర్గానికి జరిగిన ఉప ఏన్నిక లో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డీ విజయం సాదించిన సందర్బముగా స్థానిక 116 అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ తెరాస కార్యకర్తలతో కేక్ కట్ చేసి విజయ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరిచి తమ ఓటు ఎప్పుడు అభివృద్ధికే అని,అహంకారంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నిక కు కారణమైన రాజగోపాల్ రెడ్డీ నీ ఓడించారు అని అన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 నుంచి చేస్తూవున్న అభివృద్ధి చూసే తెరెసా ని గెలిపించారు, కేవలం డబ్బులు తో గెలవాలని ప్రయత్నించిన మతోన్మాద భాజపా ను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పారు అని అన్నారు. మంచి మెజారిటీతో గెలిచిన, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాపుర్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జన ప్రియ నగర్ అద్యక్షుడు కొండo శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డీ, తదితరుల పాల్గోన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more