ఉప్పల్ : తెలంగాణ రాష్ట్రం 7 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి వాసునూరి సన్నీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నా తెలంగాణ కోటి రతనాల వీణ నీళ్ళు నిధులు నియామకాలు నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ సాక్షిగా, అసువులు బాసిన అమరవీరుల స్పూర్తితో వీర వనితల పోరాట పటిమను గుర్తుతెచ్చుకుంటూ, మన తెలంగాణ కోసం పాటు పడదాం బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ సాధించుకుందాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లబోయిన మహేందర్ యాదవ్, బోడుప్పల్ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు రామోల శ్రవణ్ కుమార్, సాయి, టిల్లు తదితరులు పాల్గొన్నారు..
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more