ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్గా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఏపీ జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో సమావేశమైంది. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడినే జేఏసీ చైర్మన్గా నియమించడం సంప్రదాయం. ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ చైర్మన్గా ఉన్న పి.అశోక్బాబు ఉద్యోగ విరమణ చేయడంతో చంద్రశేఖర్రెడ్డి ఇప్పటికే ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చంద్రశేఖర్రెడ్డిని ఏపీ జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తీర్మానం చేసింది. చంద్రశేఖర్రెడ్డి నిర్వహిస్తున్న డిప్యూటీ సెక్రటరీ జనరల్ స్థానంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివా్సను ఎంపిక చేశారు.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more