నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ సదాశివరావు, జాతీయ బిసి దళ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు, డి.వి.వి సత్యనారాయణ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ఆలయంలో కోలాటం, లక్ష్మీ శ్రీనివాస్ సంకీర్తన వేద పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత తీసుకొని ఆగమ శాస్త్రం ప్రకారం పూజ నిర్వహించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత డాక్టర్ శ్రీ వి ఎస్ మూర్తి మాట్లాడుతూ కంచి పీఠం దత్త త తీసుకుని పీఠం యొక్క విధి విధానాలను ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృధి చేయాలి అనే విధంగా భక్తులకు దిశ నిర్దేశం చేసి, ఆలయ అర్చకులకు ఆలయ భక్తులకు కంచి పీఠం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ సదాశివరావు, ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేందర్ రావు, జాతీయ బీసీ దళ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డివివి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.