బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మూడు విడతలు విజయవంతంగా పూర్తిచేసుకుని 4వ విడత ఈ నెల 12న మొదలు పెట్టారు. కెసిఆర్ నిరంకుశ నియంతృత్వ కుటుంబ పాలనను అంతమోందించేందుకు చేపట్టిన ఈ పాదయాత్ర మొదటి రోజు విజయవంతం చేసుకొని నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆల్బెస్టాస్ కాలనీ లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డీ గారితో పాటు రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్,మరియు కొండాపూర్ డివిజన్ నాయకులు నరేష్ ముదిరాజ్, రమేష్ రెడ్డీ, సాగర్, శ్రీకాంత్, మదన్ అరుణ్ సుకుమార్ తదితరులు ఉన్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more