అందోల్: ఈ నేల 27వ తేదీన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన అఖిలపక్ష భేటీలో కేసీఆర్ రూపొందించిన దళితుల అభివృద్ధికై సమగ్ర ప్రణాళికను వివరిస్తూ, అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు స్థానిక శాసన సభ్యులు క్రాంతి కిరణ్ చంటి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అందుబాటులో ఉన్న దళిత నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా దళిత్ ఎంపౌర్మెంట్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలను మరియు లక్ష్యాలను వివరించారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ని సన్మానించి స్వీట్స్ పంచుతు సంబరాలు చేసుకున్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more