మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం
దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ విలీనంతో దేశంలోనే మూడవ పెద్ద బ్యాంకుగా ఇది అవతరించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్ ఈ ప్రకటన చేశారు.
మూడు బ్యాంకుల విలీనంపై జైట్లీ వివరణ ఇస్తూ, బ్యాంకుల విలీనం ప్రభుత్వం అజెండాలో ఉన్నట్టు బడ్జెట్లోనే తాము ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి అడుగు ఇప్పుడు ప్రకటించామని అన్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు మూలధన మద్దతును కూడా అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకుల బోర్డుల తుది ఆమోదం తర్వాత విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగలు, ఖాతాదారుల భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు.