తొలి పలుకు న్యూస్: ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నటువంటి పథకం….రైతుబంధు… కొన్ని కుటుంబాలలకు దైర్యాన్ని నింపి ఆర్థిక భరోసా కల్పిస్తుంటే కోన్ని కుటుంబాలలో డబ్బులకోసం గోడవలను సృష్టిస్తుంది… అదే తంతు కు సంబంధించిన విషయo తల్లి చనిపోతే వచ్చిన రైతుబంధు డబ్బుల విషయంలో కుటుంబంలో వచ్చిన తగాదా లో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రమావత్ వీరన్న అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి సమీపంలోని అకేరు వాగు వద్ద కు వెళ్ళాడని తెలుసుకున్న స్నేహితులు ఎంత వేతికిన ఆచూకీ లభించలేకపోవడంతో 100కు కాల్ చేయగానే వేంటనే అప్రమత్తం అయిన యస్సై మరియు కానిస్టేబుల్ రాజు లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆకేరు వాగు పరిసరాల్లో వెతకగా క్షణాల్లో పోయే ప్రాణాలను కాపాడారు…. యువకుడికి ఆత్మ హత్య చట్టరిత్య నేరమని కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.అతి తక్కువ సమయంలో 100కాల్ చేయంగానే స్పందించిన పోలీసులను స్థానిక ప్రజలు అభినందించారు..