రంజాన్ పండుగ సంధర్భం గా బి సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు ధూంద్ర కుమార స్వామి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశం లో కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని భౌతిక దూరంతో, చేతులు, కౌగిలింతలకు దూరంగా ఉండాలని అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను ఘనంగా జరుపుకోవాలని కుమార స్వామి పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా కరోనా ను నియంత్రించేందుకు కృషి చేస్తున్న అధికార యంత్రగాన్ని, పోలీసు , మెడికల్ సిబ్బంది , పరిశుద్ద కార్మికులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేసారు.
తిరుమల బాలాజీ సన్నిధిలో బీసీ కమిషన్ చైర్మన్
తిరుమల బాలాజీ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం ప్రత్యేక సేవలు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more