జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తో సహా పలువురు ప్రముఖులు , న్యాయమూర్తులు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ జస్టిస్ ప్రియదర్శిని న్యాయసేవలను కొనియాడారు. జస్టిస్ ప్రియదర్శిని తమ తీర్పులలో లోతైన విశ్లేషణతో, నీతి, నిజాయితీతో న్యాయాన్ని అందించారన్నారు. ఆమె తీర్పులు సమాజంలో న్యాయం అందరికీ అందాలనే ఆకాంక్షకు నిదర్శనం. పేద, అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు ఆమె చేసిన కృషి వెలకట్టలేనిది. ఆమె సిద్ధాంతాలు, ఆశయాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం అందించే దిశగా సాగాయని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. జస్టిస్ ప్రియదర్శిని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె స్ఫూర్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో ఆమె చూపిన తెగువ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు దుండ్ర కుమారస్వామి.