మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి
తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ గారికి తొలి పత్రిక క్యాలెండర్ ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా
వరుస సెలవులతో నగరవాసులు గ్రామ బాట పట్టారు. హైదరాబాద్ సిటీ విడిచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఊరికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలియజేశాడు.ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఉంచొద్దని,బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని సూచించారు. పండుగ వేలతాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే పక్క ఇంటి వారిని గానీ, పోలీస్స్టేషన్కు గాని సమాచారం అందించాలని కోరారు. నగరంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దొంగతనం జరిగిందని వినడం, ఇంటికి తాళం వేసినా దొంగలు పడ్డారనే వార్తలు నిత్యం వింటున్నాం. నేరాలను నివారించడంలో పోలీసులకు ఎంత బాధ్యత ఉందో అంతే సామాజిక బాధ్యత ప్రజలకు ఉంటుందని అన్నారు.అపరిచిత వ్యక్తుల విషయంలో అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.దొంగతనాలను వారించడానికి ప్రతి యువకుడు ప్రతి పౌరుడు ఒక పోలీసు అని తెలియజేశాడు అలా చేయడం వల్ల దొంగతనాలను నివారించవచ్చని ఇన్స్పెక్టర్ తెలిపారు.కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వారి వివరాలను స్థానికులు పోలీసులకు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలకి నూతన మరియు సక్రంతి శుభాకంక్షలు తెలియచేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్ తొలి పలుకు పత్రిక , స్టాఫ్ రిపోర్టర్ రాజు యాదవ్ , అనిల్ , లక్ష్మణ , అంజి, మరియు ఇతరులు పాల్గొన్నారు.