బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి..
42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా కాదు, చట్టపరంగానే న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు , బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీ నిర్ణయాల మేరకు అమలు చేస్తామన్న ప్రభుత్వ వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునర్ఆలోచన చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్లో పలు బీసీ సంఘాల నాయకులతో సమన్వయ చర్చలు నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ (,BC JAC), ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఈనెల 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పంచాయతీ ఎన్నికలను పార్టీపరంగా రిజర్వేషన్లను ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే సంకేతాలు రావడం బీసీ సమాజంలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తూ మోసం చేస్తూనే ఉందని, కేంద్రాన్ని నమ్మే పరిస్థితి లేక బీసీలు కాంగ్రెస్ను నమ్ముకొన్నారని గుర్తు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీల వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ద్రోహిగా ముద్రపడినా, కాంగ్రెస్పై మాత్రం బీసీలకు ఇప్పటికీ నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయకుండా రిజర్వేషన్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో బీసీల మద్దతు కాంగ్రెస్కు దక్కదని స్పష్టం చేశారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్తో పాటు ఇతర బీసీ మంత్రులు కూడా సీఎంకు తగిన సూచనలు చేసి రిజర్వేషన్లపై పునర్ఆలోచన చేయించే బాధ్యత వహించాలని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్దాస్, రమణ రాజారావు, బీసీ మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
..
42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా కాదు, చట్టపరంగానే న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు , బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీ నిర్ణయాల మేరకు అమలు చేస్తామన్న ప్రభుత్వ వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునర్ఆలోచన చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్లో పలు బీసీ సంఘాల నాయకులతో సమన్వయ చర్చలు నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ (,BC JAC), ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఈనెల 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పంచాయతీ ఎన్నికలను పార్టీపరంగా రిజర్వేషన్లను ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే సంకేతాలు రావడం బీసీ సమాజంలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తూ మోసం చేస్తూనే ఉందని, కేంద్రాన్ని నమ్మే పరిస్థితి లేక బీసీలు కాంగ్రెస్ను నమ్ముకొన్నారని గుర్తు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీల వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ద్రోహిగా ముద్రపడినా, కాంగ్రెస్పై మాత్రం బీసీలకు ఇప్పటికీ నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయకుండా రిజర్వేషన్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో బీసీల మద్దతు కాంగ్రెస్కు దక్కదని స్పష్టం చేశారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్తో పాటు ఇతర బీసీ మంత్రులు కూడా సీఎంకు తగిన సూచనలు చేసి రిజర్వేషన్లపై పునర్ఆలోచన చేయించే బాధ్యత వహించాలని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్దాస్, రమణ రాజారావు, బీసీ మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.