సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్ గాంధీ ?
మాజీ ప్రధాని రాజీవ్గాంధీపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన 1984- సిక్కు వ్యతిరేక అ్లలర్లను రాజీవ్ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని ఆరోపించారు. అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్గాంధీ తనతో ఢిల్లీలో కలియతిరిగారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బాదల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘తనతో రాజీవ్ గాంధీ తిరిగారని టైటర్ల చెప్పడమంటే సిక్కుల హత్యను దగ్గరుండి రాజీవ్ పర్వవేక్షించారని అంగీకరించినట్టే’ అని బాదల్ పేర్కొన్నారు. టైటర్ల వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్గా పరిశీలించాలని కోరారు.
1984 అక్టోబర్ 31న సిక్కు బాడీగార్డుల కాల్పుల్లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 3,325 మంది మరణించారు. ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ఊచకోతకు గురయ్యారు. 1947 దేశ విభజన తర్వాత జరిగిన అతి తీవ్రమైన కమ్యూనల్ ఘర్షణలుగా సిక్కుల ఊచకోత ఘటన నిలిచింది.