కూకట్ పల్లి : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్డర్ నగర్ లో నూతన కోవిడ్ వాక్సిన్ సెంటర్ ను మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్, మరియు పారిశుధ్య శాఖ అధికారుల తో కలిసి డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ సెంటర్ అందుబాటులో ఉండాలని నూతన వాక్సిన్ సెంటర్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతతో తప్పకుండా వాక్సిన్ తీసుకోవాలని, కోవిడ్ నుంచి మనల్ని, మరియు మీ చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకునేందుకు ఇదొక అస్త్రం అని తెలిపారు. మాకు ప్రతి విషయం లోను ఎంత గానో సహకరిస్తున్న కూకట్పక్లీ ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వీరారెడ్డి, హమీద్, జ్ఞానేశ్వర్, సయ్యద్ రియాజ్, సలీమ్, రఫిక్,రుబిన,తాజ్ బీ, తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more