తొలిపలుకు న్యూస్ (నిజామాబాద్): తెలంగాణ రాష్ట్ర, టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో, ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రగతి పథంలో ముందుకు సాగాలని కవిత ఆకాంక్షిచారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more