కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, కర్నూల్ జిల్లాలో
కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న RSI ప్రదీప్ అత్యవసర పరిస్థితుల్లో వచ్చి రక్తదానం చేసి బాలుడిని రక్షించారు.. ఇక వివరాల్లోకి వెలితే…
తెలంగాణ రాష్ట్రం, అలంపూర్ మండలం, ఉండవెల్లి గ్రామంకు చెందిన ఒక బాలుడు కి పచ్చకామెర్లు, (జాండీస్) రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో(Govt. Hospital) చేరాడు. అర్జెంట్ గా ఆ బాబు కి ఓ నెగిటివ్ బ్లడ్ ఇవ్వాలని డాక్టర్లు తెలపడంతో కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే RSI ప్రదీప్ స్పందించి వెంటనే రక్త దానం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు, తోటి సిబ్బంది రక్తదానం చేసిన ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ కు అభినందనలు తెలిపారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



