హైదరాబాద్: లాక్ డౌన్ అంశంపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడించాలని రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు. అయితే, లాక్డౌన్ సమయాన్ని సడలించారు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ఉన్న సడలింపు సమయాన్ని ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు అందరూ ఇళ్లకు చేరుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందన్నారు.
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more


