లాక్ డౌన్ లో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం ప్రజల గురించి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు, వైద్య సిబందికి, పోలీసులకు వివేకానందనగర్ డివిజన్ మాధవరం నగర్ కాలనీ అధ్యకులు మాధవరం ముత్యల్ రావు కృతజ్ఞతలు తెలిపారు .అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరికెపుడి గాంధీ సూచన మేరకు తమ కాలనీ లో కొంత మంది రవి, ఆశిష్ పటేల్, సాయినాథ్ రమేష్, ప్రశాంతి రెడ్డి ల సహకారం తో ఈ రోజు వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయ్, మాధవరం కాలనీ అధ్యక్షుడు మాధవరం ముత్యల్ రావు, ప్రధాన కార్యదర్శి సబ్భారావు తో కలసి GHMC సిబంధికి, దినసరి కూలీలకు, వచ్మెన్ లకు, కాలనీ లో నివసిస్తున్న పేద వాళ్ళకి సుమారు 450 నుండి 500 మందికి పైగా 5kg బియ్యం, 1kg పప్పు, 1kg నూనె, మరియు కూరగాయలు మొదలగు నిత్యావసర సరుకులు అందించారు. ఈసందర్భముగా మాధవరం కాలనీ అధ్యక్షులు ముత్యాల్ రావు మాట్లాడుతూ కరోనా మహమ్మరిని తరిమి కొట్టాలంటే అవసరం ఉంటే తప్పఇంట్లో నుండి ఎవరు బయటకి రావొదని,మస్కులు తప్పని సరి వినియోగించుకోవాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, చేతులు శుభ్రముగా కడుకోవలని సూచించారు.ఈ కరిక్రమనికి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పలుగొన్నారు
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
Read more