భారత్ నుండి పొరపాటున దూసుకెళ్ళిన క్షిపణి పాకిస్తాన్ భూభాగం లో కుప్పకూలిపోయింది. ఈ సంఘటనపై ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం భారత దౌత్యాధికారిని గురువారం రాత్రి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఈ సంఘటన ను ఖండిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
భారత నుండి వచ్చి పాకిస్తాన్ మార్గం లోకి దూసుకొచ్చిన ఆ వస్తువు సూపర్ సోనిక్ వేగంతో దూసుకొచ్చి కూలిపోయిందని తెలిపింది. అయితే దీని వల్ల వారికి ఎక్కువ మొత్తంలో ఆస్తులకు నష్టం కల్గిందని పాకిస్థాన్ తెలిపింది.
సూరత్గఢ్ నుంచి వచ్చిన ఆ వస్తువు 6.50గం.ల సమయంలో పంజాబ్ ప్రావిన్స్లోని ఖానేవాల్ జిల్లా పరిధి మియాన్ చున్ను పట్టణానికి దగ్గరలో కుప్పకూలిపోయింది. ఇలాంటి చర్యల వలన ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలకు కూడా ప్రమాదం పొంచిఉందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన లో పేర్కొంది.