రుద్రప్రయాగ్ :ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...
Read more