వలిగొండ: వలిగొండ మండలం నాగారం గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి ద్రావణాన్ని ఊరు మొత్తం శానిటైజేషన్ చేయించడం జరిగింది.. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తీగల కృష్ణయ్య,మాట్లాడుతు, గ్రామంలోని అందరూ విధిగా పరిశుభ్రత పాటించి, మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, గ్రామ ప్రజలందరు కోవిడ్ రూల్స్ పాటించి, కరోనా మహమ్మారి భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, బెల్దే నాగేశ్వర్, వార్డు నెంబర్ గోళ్ల సురేష్, గ్రామ యువకులు, మైసోల్ల సత్యం, వంగాల శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.