• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured Eminent Personalities

అద్భుతమైన చలనచిత్ర కళాఖండాలను అందించిన అద్భుత ప్రతిభామూర్తి… బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి.నాగిరెడ్డి)

TP NewsbyTP News
31/12/2020
inEminent Personalities, Entertainment, Featured
0
అద్భుతమైన చలనచిత్ర కళాఖండాలను అందించిన అద్భుత ప్రతిభామూర్తి… బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి.నాగిరెడ్డి)

విజయా సంస్థ అనగానే అద్భుతమైన చలనచిత్ర కళాఖండాలతోబాటు బి.నాగిరెడ్డి కూడా గుర్తుకు రావడం సహజం. యాభై సంవత్సరాలకు పైగా క్రమశిక్షణతో కూడుకున్న జీవితం, ఉత్తమ సంస్కారం, అహర్నిశలూ పనిచేసే గుణం మూర్తీభవించిన గొప్ప వ్యక్తిగా రాణించిన ప్రతిభా మూర్తి నాగిరెడ్డి. కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్యా సేవలు, వైద్య సేవలు ఉచితంగా అందించారు. ఎన్నో గుప్తదానాలు చేశారు. మామూలు రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపార దక్షునిగా రాణించి, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో ఆధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది నాగిరెడ్డి. ‘చందమామ’ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతి బోధలు చేసిన ముందు చూపుగల మహామనీషి. సినిమా విశేషాలను పాఠకులకు చక్కని బొమ్మలతో పొందికైన అక్షరాలతో అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని నాగిరెడ్డి ‘విజయచిత్ర’ సినిమా పత్రికను ప్రారభించారు. ఆ పత్రిక ప్రారంభ సంచికలో సంపాదకీయం రాస్తూ ‘అందమైన విజయచిత్ర సినిమా పత్రికలో పక్షపాతానికీ, మొహమాటానికీ, అసభ్య రచనలకీ, అవాచ్యమైన రాతలకీ తావు లేదు. విజయచిత్ర ఉన్న మంచినే చెబుతుంది… ఉన్నా చెడు చెప్పదు’ అనే లక్ష్యాన్ని నిర్దేశించిన మేధావి నాగిరెడ్డి. అసాధారణ వ్యక్తిత్వం, బహుముఖ ప్రజ్ఞ నాగిరెడ్డికి శిరోభూషణాలు.

నాగిరెడ్డి బాల్యం…

కడప జిల్లా పొట్టిపాడు గ్రామం నాగిరెడ్డి పుట్టిన వూరు. 1912 డిసెంబరు 2న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ దంపతులకు నాగిరెడ్డి జన్మించారు. నాగిరెడ్డి అన్నగారు ప్రముఖ దర్శకనిర్మాత, వాహినీ సంస్థ అధిపతి బి.ఎన్‌.రెడ్డి. నాగిరెడ్డికి ఇద్దరు తమ్ముళ్లు. కొండారెడ్డి మంచి సినిమాటోగ్రాఫర్‌. రామలింగారెడ్డి వ్యాపారంలో స్థిరపడ్డారు. నాగిరెడ్డి పూర్వీకులది కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లి. కొన్నాళ్ళకు వారి కుటుంబాలు పొట్టిపాడు గ్రామానికి వచ్చి స్థిరపడ్డాయి. నాగిరెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఆరోజుల్లోనే ఉమ్మడి మద్రాసులో కమీషన్‌ వ్యాపారం చేస్తుండేవారు. దాంతో నాగిరెడ్డి మాత్రం వారి తాతగారైన హనుమన్నఇంటిలోనే పెరిగారు. రామరాజు అనే ఉపాధ్యాయుని శిష్యరికంలో రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలు చదవడం అలవాటయింది. జీవిత పునాదులు రామరాజు గురువు చలువతోనే గట్టిపడ్డాయి. నాగిరెడ్డి తన పద్నాల్గవ యేట మద్రాసు చేరుకున్నారు. గోవిందప్ప నాయకన్‌ వీధిలోని పాఠశాలలో అన్న బి.ఎన్‌.రెడ్డితో కలిసిచదువు కొనసాగింది. స్వాతంత్రోద్యమం బాగా వూపందుకుంటున్న రోజుల్లో గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహం, విదేశీవస్తు బహిష్కరణోద్యమాలలో నాగిరెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు నాగిరెడ్డిని దుర్గాబాయి దేశముఖ్‌ దళంలో చేర్పించారు. బి.ఎన్‌.రెడ్డితో కలిసి గ్రామాలకెళ్లి ఖద్దరు ప్రచారం చేశారు. దాంతో రకరకాల వ్యక్తుల్ని కలవడం, వారితో స్వాతంత్య్ర భావాలు పంచుకోవడం అలవడింది. తను కూడా ఖద్దరు పైజమా, ఖద్దరు జుబ్బా, తలమీద ఖద్దరు టోపీతో గ్రామాలు తిరగంతో నాగిరెడ్డిని తమాషాగా ‘చిన్న గాంధి’ అని పిలిచేవారు. బి.ఎన్‌.రెడ్డి మాత్రం చదువు కొనసాగించగా, తండ్రి ఆజ్ఞమేరకు నాగిరెడ్డి ఉల్లిపాయల వ్యాపారం నిమిత్తం ఓడలో రంగూన్‌ (బర్మా దేశం) వెళ్ళారు. అక్కడ తమ కుటుంబ స్నేహితుడు ఇస్మాయిల్‌ మహమ్మద్‌ ఇంటిలో ఉంటూ వ్యాపారం చేసేవారు. తీరిక సమయాల్లో వారి దగ్గర ఉర్దూ భాష నేర్చుకునేవారు. రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో మద్రాసు తిరిగివచ్చారు.

వాహిని సంస్థ ఆవిర్భావం...

బి.ఎన్‌.రెడ్డి, మీసాలపులి హెచ్‌.ఎం.రెడ్డితో కలిసి రోహిణీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ బ్యానర్‌ మీద హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) సినిమా నిర్మించారు. అందులో నాగయ్య, కన్నాంబ, కాంచనమాల, రామానుజాచారి మొదలగువారు నటించారు. సినిమా విజయవంతమైంది. తరువాత హెచ్‌.ఎం.రెడ్డితో బి.ఎన్‌.రెడ్డికి విభేదాలొచ్చి విడిపోయారు. దాంతో రోహిణి నుంచి ‘వాహిని’ సంస్థ అవతరించింది. ఈ సంస్థకు రచయిత సముద్రాల రాఘవాచార్య, సినిమాటోగ్రాఫర్‌ రామనాథ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ శేఖర్, కె.వి.రెడ్డి మూలస్తంబాలుగా వుండేవారు. ఆ సంస్థ బ్యానర్‌ మీద బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ‘వందేమాతరం’ (1938) విడుదలైంది. నాగయ్య, కాంచనమాల, దొరస్వామి, శేషుమాంబ నటంచిన ఈ చిత్రం విజయవంతమైంది. తరువాత బి.ఎన్‌.రెడ్డి ‘సుమంగళి’ (1940) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి నాగిరెడ్డి అటు వ్యాపారం చూసుకుంటూనే వినూత్నరీతిలో పబ్లిసిటీ సమకూర్చారు. జెమిని వాసన్‌ ఆ సినిమా హక్కులు కొనుక్కున్నారు. తరువాత 1941లో వాహినీ సంస్థ ‘దేవత’ చిత్రాన్ని నిర్మించి విజయం సాధించింది. నాగయ్య. కుమారి, టంగుటూరి సూర్యకుమారి, లింగమూర్తి ఈ చిత్రంలో తారాగణం. తరువాత నిర్మించిన ‘భక్త పోతన’ (1942) చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకుడు. నాగయ్య, గౌరీనాథశాస్త్రి, లింగమూర్తి, మాలతి, హేమలత నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి వాహినీ సంస్థకు కాసులు రాల్చింది. నాగిరెడ్డి ఈ చిత్రానికి పబ్లిసిటీ కోసం ముప్పై అడుగుల ఆంజనేయస్వామి కటవుట్‌ తయారు చేయించి నాలుగు దారుల కూడలిలో పెట్టించి ప్రేక్షకులను ఆకర్షింపజేశారు. తరువాత నాగిరెడ్డి మద్రాసులో బి.ఎన్‌.కె ప్రెస్‌ ప్రారంభించి రామకృష్ణ మిషన్‌ వంటి ధార్మిక సంస్థల పుస్తకాలను అచ్చువేయించే పని చేబట్టారు. వాహినీ సంస్థకు ఆర్ధిక చేయూతనిస్తూ ప్రోత్సహించిన మూలా నారాయణస్వామి సహకారంతో వాహిని స్టూడియో రూపుదిద్దుకుంది. సమాంతరంగా ‘విజయా ప్రొడక్షన్స్‌’ సంస్థ కూడా ఆవిర్భవించింది. యువ పబ్లికేషన్స్, శరత్‌ అనువాద నవలలు బి.ఎన్‌.కె ప్రెస్‌లో ముద్రింప జేసుకుంటున్న ఆలూరు చక్రపాణి విజయా సంస్థలో భాగస్వామిగా చేరారు. వాహిని స్టూడియోని విజయా ప్రొడక్షన్స్‌ పేరుతో లీజుకు తీసుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణిలు. వాహిని వారి ‘స్వర్గసీమ’ (1943)కు మాటలు సమకూర్చింది చక్రపాణే. 1947లో ‘చందమామ’ పత్రికను ప్రారంభించారు. దానికి చక్రపాణి సంపాదకత్వం వహిస్తే, నాగిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ మాసపత్రికకు సంపాదకత్వం స్వీకరించారు.

విజయా వారి తొలి చిత్రం షావుకారు…

నవంబరు 5, 1949న విజయావారి తొలి చిత్రం ‘షావుకారు’ ప్రొడక్షన్‌ మొదలైంది. ఎల్‌.వి.ప్రసాద్‌ సారధ్యంలో నిర్మించిన ఈ చిత్రం 7, ఏప్రిల్‌ 1950న ఆంధ్రదేశమంతటా విడుదలైంది. ఆ రోజుల్లోనే ఈ సినిమాకి ‘ఇరుగు పొరుగుల కథ’ అనే ట్యాగ్‌ లైను తగిలించారు. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా వ్యవహరించగా గోవిందరాజుల సుబ్బారావు, ఎన్‌.టి.రామారావు, ఎస్‌.వి. రంగారావు, రేలంగి, జానకి, శాంతకుమారి ముఖ్యపాత్రలు పోషించారు. కథ, మాటలు చక్రపాణి సమకూర్చగా, సముద్రాల పాటలు, ఘంటసాల సంగీతం కూర్చారు. సినిమా యావరేజిగా ఆడింది. 1951లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘పాతాళభైరవి’ సినిమా నిర్మించారు. కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు రాయగా ఘంటసాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఎన్‌.టి.రామారావు,ఎస్‌.వి. రంగారావు, సి.ఎస్‌.ఆర్, రేలంగి, మాలతి, హేమలతమ్మారావు, సురభి కమలాబాయి నటించారు. సినిమా సూపర్‌ హిట్టై 185 రోజులు ఆడింది. దాంతో వాహిని స్టూడియోలో మరొక ఫ్లోర్‌ నిర్మించి దానికి ‘పాతాళభైరవి’ అని పేరుపెట్టారు. 1952లో చక్రపాణి స్క్రిప్టు, పింగళి పాటలతో ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో మరొక సాంఘిక చిత్రం ‘పెళ్ళిచేసి చూడు’ చిత్రాన్ని నాగిరెడ్డి నిర్మించారు. అప్పటికే విజయా సంస్థలో కాంట్రాక్టు మీద వున్న రామారావు హీరోగా నటించగా జి. వరలక్ష్మి హీరోయిన్‌గా నటించింది. ఘంటసాల అద్భుత సంగీతం సమకూర్చిన ఈ చిత్రం కూడా విజయ దుందుభి మోగిస్తూ 182 రోజులు ఆడింది. అయితే ఎల్‌.వి. ప్రసాద్‌ పర్యవేక్షణలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘చంద్రహారం’ (1954) ఫ్లాపయింది. అయితే 1955లో నాగిరెడ్డి-చక్రపాణి ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో ‘మిస్సమ్మ’ చిత్రాన్ని నిర్మించారు. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, రంగారావు, రేలంగి, జమున, ఋష్యేంద్రమణి నటించిన ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించారు. పింగళి పాటలు అద్భుతంగా అమరి సూపర్‌ హిట్టయ్యాయి. ఈ సినిమాను సమాంతరంగా తమిళంలో కూడా తీశారు. అది

శతదినోత్సవం చేసుకుంది. ఇక 1957లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్‌’ చిత్రం 175 రోజులపైగా ఆడి చరిత్ర సృష్టించింది. తెలుగు చలచిత్ర పరిశ్రమలో వున్న హేమాహేమీలందరూ ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇక వరసగా ‘అప్పుచేసి పప్పుకూడు’ (ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకుడు) చిత్రం శతదినోత్సం చేసుకోగా, కె.వి. రెడ్డి దర్శకత్వం వహించిన ‘జగదేకవీరుని కథ’ కూడా 175 రోజులు ఆడింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘గుండమ్మ కథ’ సూపర్‌ హిట్‌ గా నిలిచి 175 రోజులకు పైగా ఆడింది. తరవాత వచ్చిన ‘సత్యహరిశ్చంద్ర’ (1965) గొప్పగా ఆడకపోయినా, తాపీ చాణక్య దర్శకత్వం వహించిన సి.ఐ.డి చిత్రం 106 రోజులు ఆడి శతదినోత్సవం చేసుకుంది. సురేష్‌ రామానాయుడు నిర్మించిన ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని హిందీలో నాగిరెడ్డి-చక్రపాణి ‘రామ్‌ అవుర్‌ శ్యామ్’ పేరుతో పునర్నిర్మించగా చిత్రం బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. అయితే 1968లో విజయావారు నిర్మించిన ‘ఉమా చండి గౌరీ శంకరుల కథ’ బాగా ఆడలేదు. విజయా సంస్థ తెలుగులో నిర్మించిన చిత్రాలు వేళ్ళమీద లెక్కించ తగినవే అయినా అవి వేటికవే మాస్టర్‌ పీసులే!

విశేష ప్రతిభా మూర్తి నాగిరెడ్డి…

1942లో జెమినీ వారి ‘బాలనాగమ్మ’, వాహిని వారి ‘భక్తపోతన’ చిత్రాలు కేవలం ఇరవై రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ‘బాలనాగమ్మ’ చిత్రం విడుదలకు ముందు బెంగుళూరులో జెమిని వారు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చారు. ఎక్కడ చూసినా ఆ సినిమా పోస్టర్లే దర్శన మిచ్చాయి. నాగిరెడ్డి ఊరంతా తిరిగి చూశారు. జెమినీకి పోటీగా వాల్‌ పోస్టర్లతో పబ్లిసిటీ రాదనీ గ్రహించారు. వెంటనే విజయవాడ నుంచి, మద్రాసు నుంచి నిపుణులైన కార్పెంటర్లను, పెయింటర్లను బెంగుళూరు పిలిపించి ముప్పై అడుగుల హనుమంతుడి కటవుట్‌ తయారు చేయించి దానిని పది అడుగుల పీఠం మీద నిలబెట్టించి, దానిమీద ‘భక్తపోతన’ ప్రకటన రాయించి మల్లేశ్వరం కూడలిలో పెట్టించారు ఇక ఆ సర్కిల్‌ నిండా జనం తీర్థానికి వచ్చినట్లు వచ్చి ఆ భారీ ఆంజనేయుని కటవుట్‌ని చూస్తూ ప్రదక్షిణలు చేశారు. ‘భక్త పోతన’ సినిమా వీల్యాండ్‌ థియేటర్‌లో విడుదలైంది. జనాన్ని కంట్రోల్‌ చెయ్యలేకపోయారు. బ్యారికేడ్లు విరిచేసి ప్రేక్షకులు టికెట్ల కోసం ఎగబడ్డారు. అలా ‘భక్తపోతన’ చిత్ర విజయానికి నాగిరెడ్డి చేసిన తెలివైన కృషి అద్వితీయం. ‘సుమంగళి’ చిత్రాన్ని నాగిరెడ్డి అన్న బి.ఎన్‌.రెడ్డి నిర్మించారు. ఆ సినిమా పూర్తి కావస్తుండగా పంపిణీ హక్కుల కోసం ఒక వ్యక్తి బి.ఎన్‌ వద్దకు వచ్చాడు. ఆయన చెప్పిన రేటుకి బి.ఎన్‌ హక్కులు ఇవ్వనన్నారు. అయితే ఆ సదరు వ్యక్తికి మద్రాసు నగరంలోని లైటు స్తంభాలకు వెదురు దట్టీలు కట్టి వాల్‌ పోస్టర్లు అంటించి ప్రచారం చేసుకునే హక్కులు మద్రాసు కార్పోరేషన్‌ వారు ఇచ్చివున్నారు. దాంతో ‘సుమంగళి’ సినిమా ప్రచారానికి అతడు అడ్డు తగిలాడు. నాగిరెడ్డి పూనుకొని వెదురు దట్టీల కొలతకి 500 ఫ్రేములు తయారు చేయించి, వాటికి గొనె సంచుల గుడ్డలు వేసి కుట్టించి వాటిమీద మద్రాసు కార్పోరేషన్‌ వారు ముద్రవేసిన పోస్టర్లను అతికించి, ఆ పోస్టర్లను మద్రాసు నగర్‌ రోడ్లకు ఇరువైపులా వున్న చెట్లకు అటూ ఇటూ కట్టి వేలాడదీయించారు. దాంతో సినిమాకు అఖండమైన పబ్లిసిటీ లభించి సినిమా విజయానికి సహకరించింది. (ఆరోజుల్లో వాల్‌ పోస్టర్లు తగిలించాలంటే కార్పోరేషన్‌ వారికి పన్ను చెల్లించి ముద్రవేయించుకోవాలి). జెమినీ అధిపతి వాసన్‌ నాగిరెడ్డి దూరదృష్టికి అభినందనలు తెలిపేవారు. చక్రపాణితో నాగిరెడ్డికి మైత్రీబంధం విడదీయరానిది. ప్రొడక్షన్‌ పనుల్లో చక్రపాణి చెయ్యిపెడితే నాగిరెడ్డి పెట్టుబడి వ్యవహారాలకే పరిమితమయ్యేవారు. చక్రపాణి తీసుకునే నిర్ణయాలకు బద్ధుడై మెలిగేవారు. ‘మిస్సమ్మ’ చిత్రానికి మొదట్లో భానుమతిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. నాలుగు రీళ్ల సినిమా తీశాక భానుమతి ఒకరోజు షూటింగుకు ఆలస్యంగా హాజరైంది. చక్రపాణికి సంజాయిషీ ఇస్తూ ముందురోజే కాగితం రాసి ప్రొడక్షన్‌ సిబ్బందికి అందజేశానని, వరలక్ష్మివ్రతం కారణంగా ఆలస్యమవుతుందని అందులో పేర్కొన్నానని భానుమతి చెప్పినదానికి చక్రపాణి ఒప్పుకోలేదు. నిజానికి ఇద్దరూ రచయితలే. ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ఇద్దరూ మంచి సాహితీ మిత్రులు. అయినా చక్రపాణి ఉపేక్షించలేదు. భానుమతిని తొలగించి, సావిత్రిని ‘మిస్సమ్మ’ పాత్రలో పెట్టి సినిమా పూర్తిచేయించారు. నాగిరెడ్డి అందుకు చక్రపాణికి పూర్తి మద్దతు ప్రకటించారు. సమయపాలనకు, క్రమశిణకు వీరిద్దరూ మారుపేర్లే. ఇద్దరూ కృష్ణార్జునులులాగా వ్యవహరిస్తూ విజయా సంస్థను ముందుకు నడిపారు. ‘చందమామ’ పత్రిక ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించుకున్నదంటే ఆ క్రెడిట్‌ నాగిరెడ్డి, చక్రపాణికే దక్కుతుంది. జెమిని వాసన్‌ వద్దకు నాగిరెడ్డి అప్పుడప్పుడు సలహాలకోసం వెళ్ళేవారు. ఇద్దరూ మంచి మిత్రులుగా మసలారు. వాసన్‌ మొదట ‘ఆనంద వికటన్‌’ అనే పత్రిక నడిపేవారు. మెల్లగా జెమిని సంస్థను స్థాపించి స్టూడియో అధిపతిగా ఎదిగారు. నాగిరెడ్డికి వాసన్‌ స్పూర్తి. వాసన్‌ని ఆదర్శంగా తీసుకొని నాగిరెడ్డి విజయా సంస్థను నెలకొల్పారు. ఎన్‌.టి.రామారావు కి విజయా మాతృసంస్థ. నాగిరెడ్డిని రామారావు ‘నాన్న గారూ’ అని ‘ఫాదర్‌’ అని పిలిచేవారు. విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవం చేసుకున్న ‘పాతాళభైరవి’ చిత్రానికి పనిచేసిన ముఖ్యకళాకారులందరికీ నాగిరెడ్డి ‘బ్యూక్‌’ కంపెనీ కార్లను బహుమతిగా అందజేశారు. రామారావు ఆ కారును ‘ఫాదరిచ్చిన కారు’ అని గొప్పగా చెప్పుకునేవారు. రామారావు విజయా సంస్థలో 20 చిత్రాలకు పైగా నటించారు. ‘మాయాబజార్‌’ చిత్రం విడుదలైనప్పుడు ఎన్టీఆర్‌ కృష్ణుడి వేషాన్ని నలభై వేల కలర్‌ క్యాలండర్లుగా ముద్రించి అమ్మారు. ఆంధ్రా అంతటా వాటిని ఫ్రేములు కట్టించుకొని ఇళ్ళలో, షాపుల్లో పెట్టుకున్నారు. కొందరైతే పూజామందిరాల్లో కూడా పెట్టుకొని పూజలు నిర్వహించారు. ఈ ఐడియా నాగిరెడ్డిదే! ఎం.జి.రామచంద్రన్‌తో నాగిరెడ్డి అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎమ్జీఆర్‌ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్‌ నుండి మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎమ్జీఆర్‌ సూచన మేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు. ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షునిగా నాగిరెడ్డి నాలుగు సార్లు దక్షతతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. తిరుమల-తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షునిగా నాగిరెడ్డి వ్యవహరించారు. మెడికల్‌/ఎడ్యుకేషన్‌ ట్రస్టును స్థాపించి సేవలందించారు. చలనచిత్ర రంగానికి ఎనలేని కృషి చేసినందుకు భారత ప్రభుత్వం 1987లో నాగిరెడ్డిని ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు నిచ్చిసత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందజేసింది. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నాగిరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రసాదించాయి. నాగిరెడ్డికి ముగ్గురు కొడుకులు. వారిలో వెంకటరామ రెడ్డి, విశ్వనాథ రెడ్డి సినిమా నిర్మాణంలో వున్నారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 21 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు.

– ఆచారం షణ్ముఖాచారి గారు (సితార)

Tags: B Nagi ReddyMovie Personalities
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News