లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ట్రస్టీ మల్లెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూచించిన విధంగా కరోణ మహమ్మరి కట్టడి కోసం స్వీయ నియంత్రణ పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు .మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని దాదాపు తొమ్మిది వందల మందికి నిత్యావసర వస్తువులను కొంత మంది సహాయ సహకారాలతో తన వ్యక్తిగతంగా కొంత మేరకు సహాయం తోడ్పాటును అందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతుందని ఆయన అన్నారు .సమాజంలో అందరూ బాగుండాలని వారి యోగక్షేమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్లాఘనీయమైన సేవలందిస్తుందని ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా అత్యవసర సమయాల్లోనే అవకాశం వినియోగించుకోవాలని పోలీసులకు శానిటరీ సిబ్బందికి రెవెన్యూ శాఖలకు ప్రతి ఒక్కరు సహకరించి కరుణ కట్టడికి ప్రజలు ముందుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more