ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు (ప్రోటోకాల్ మరియు పౌర సంబంధాలు) శ్ హార్కార వేణుగోపాల్ రావు , జాతీయ బీసీ దళ్ తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు శ్రీ డి.వి.వి. సత్యనారాయణ కలిసి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని వారి దివ్య ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్ రావు గ స్వామివారిని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐక్యతతో జీవించాలని ప్రార్థించారు.
సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధర్మపరమైన విలువలు నిలవాలంటే ఆధ్యాత్మికతే మార్గమని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తమైంది. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు తమ ఆశీస్సుల ద్వారా ప్రజల్లో ధైర్యం, నైతిక బలం, సేవాభావం పెంపొందించాలని సూచిస్తూ, ఆధ్యాత్మిక చైతన్యం పెరిగినప్పుడే సత్యం, న్యాయం, సమానత్వం సాధ్యమవుతుందని ఉపదేశించారు. ప్రజలు పరస్పర గౌరవం, ప్రేమ, సేవాభావంతో ముందుకు సాగితేనే సుభిక్షమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది అన్నారు.