శేరిలింగంపల్లి , తొలి పలుకు: మునుగోడు నియోజకవర్గం ఉపాఎన్నికల సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యమ్. సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గం ఎ- బ్లాక్ అధ్యక్షుడు యం డి. ఇలియాస్ షరీఫ్ ఆధ్వర్యంలో గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి బయలుదేరారు. వెళ్లినవారిలో మియాపూర్ డివిజన్ అధ్యక్షులు నల్లగండ్ల రమేష్ కుమార్, యస్ సి సెల్ నాయకుడు నడిమింటి కృష్ణ,వి.ఈశ్వర్,సురేష్ బాబు,విజయ్ ,రాజు, రవియాదవ్ మహిళా నాయుకురాలు భారతమ్మ, శాంతి యూత్ నాయకులు యమ్ డి.షరీఫ్,షారుఖ్,ముశ్రాఫ్, మోసిన్, అఫ్రోజ్,అద్నన్, బోటు శ్రీను తదితరులు ఉన్నారు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


