బీసీలకు పెద్దపీట -ఏపీ సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు-బిసి దళ్ అధ్యక్షుడు కుమారస్వామి.
మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తూ, ఈరోజు కులాల సమీకరణాలు ,నాయకత్వ లక్షణాలు మరియు సీనియర్ నేతలు అనేక అంశాలను బేరీజు వేసుకుంటూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏర్పాటు చేయడం దానిలో కులాల లెక్కలు అనేక సమీకరణాలు కసరత్తు చేస్తూ, బీసీలకు పెద్దపీట వేయడం గమనార్హం. విషయంలోకి వెళితే ఏపీ కొత్త క్యాబినెట్ లో సామాజిక సమీకరణలు ఆధారంగా కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయడం. దానిలో భాగంగా బీసీలకు పెద్దపీట వేయడం బీసీ పక్షపాతి అని బీసీ ప్రజానీకం సంతోషం తెలియజేస్తున్నరు. దీనిలో భాగంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
25 మందితో ఏపీ కొత్త క్యాబినెట్ ఏర్పాటులో ,సామాజిక సమీకరణలు ఆధారంగా 10 మందికి క్యాబినెట్లో చోటివ్వడం హర్షించదగ్గ విషయమని జాతీయ బీసీ దల్ అధ్యక్షులు తెలియజేశారు. ఇదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు బీసీలకు సామాజిక సమీకరణ ఆధారంగా బీసీలను గుర్తించాలని , రాజకీయ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. కేంద్రం కూడా వెంటనే బీసీ బిల్లు పెట్టి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.